మంత్రికి గడికోట సవాల్: రాయచోటి అభివృద్ధిపై చర్చ!

naveen
By -

 

Gadikota Srikanth Reddy

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిపై, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఇష్టానుసారం ఆరోపణలు చేస్తూ, ప్రజల్లో ద్వేషాలు రేపుతున్నారని మండిపడ్డారు.


అభివృద్ధిపై చర్చకు నేను రెడీ!

"రాయచోటి అభివృద్ధి గురించి చర్చించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. మీరు అధికారులతో కలిసి రండి.. నేను ఒక్కడినే వస్తా. గత ఐదు సంవత్సరాల్లో ఏం చేశానో చూపిస్తా" అని గడికోట శ్రీకాంత్ రెడ్డి సవాల్ విసిరారు. తాను రేపటి తరాల కోసం పనిచేస్తానని, అభివృద్ధి చేయడం ముఖ్యమని వ్యాఖ్యానించారు.


"18 నెలల్లో మీరేం చేశారు?"

కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అవుతోందని , ఈ కాలంలో మంత్రి రాంప్రసాద్ ఏం అభివృద్ధి చేశారో ప్రజల ముందు చెప్పాలని గడికోట డిమాండ్ చేశారు. "తొడలు కొడతాం, మీసాలు తిప్పుతాం అంటూ బెదిరించడం వల్ల ఎవరూ భయపడరు. అభివృద్ధి గురించి మాట్లాడాలి" అని హితవు పలికారు.


జిల్లా విభజనపై మౌనమెందుకు?

"నిండు శాసనసభలో రాయచోటి గురించి ఆదోని ఎమ్మెల్యే అవమానకరంగా మాట్లాడినప్పుడు మీరు ఎందుకు మౌనం వహించారు?" అని మంత్రిని ప్రశ్నించారు. ప్రస్తుత కేబినెట్‌లో జిల్లాను విభజించే యత్నాలు జరుగుతున్నాయని, దానిని ఆపేందుకు మంత్రి ప్రయత్నం చేయాలని శ్రీకాంత్ రెడ్డి సూచించారు.


"రాయచోటి అభివృద్ధిపై చర్చకు రెడీ.. నేను వస్తా, మీరు రండి" అంటూ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి.. మంత్రి రాంప్రసాద్ రెడ్డికి నేరుగా సవాల్ విసరడం రాయచోటి రాజకీయాల్లో వేడిని పెంచింది.


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!