వెండితెరపై మాయాజాలం సృష్టించే క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ గుండెలోంచి వచ్చిన ఆవేదన ఇది! సినిమా అంటే కేవలం రంగుల ప్రపంచం కాదు.. సమాజానికి అద్దం పట్టే నగ్న సత్యం అని నమ్మే ఒక దర్శకుడి సంచలన వ్యాఖ్యలివి! 'యూఫోరియా' సినిమా ఓటీటీ రిలీజ్ వేదికగా ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
బాక్సాఫీస్ వద్ద నిరాశ.. కానీ 'ధురంధర్' స్థాయి హిట్టు కొడుతుందనుకున్నా!
గుణశేఖర్ స్వీయ దర్శక నిర్మాణంలో భూమిక, సారా అర్జున్, రోహిత్, విఘ్నేశ్ గవిరెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన సోషల్ డ్రామా ‘యూఫోరియా’.
ఫిబ్రవరి 6న థియేటర్లలో భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా, విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది.
ఈ ఫలితంపై స్పందించిన గుణశేఖర్.. తన సినిమా కమర్షియల్గా 'ధురంధర్' స్థాయి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంటుందని బలంగా నమ్మానని కుండబద్దలు కొట్టారు.
ప్రేక్షకుల నాడిపై ఉన్న నమ్మకంతోనే ఇది పెద్ద హిట్ అవుతుందని భావించానని, అసలు ఇది నేషనల్ సబ్జెక్ట్ కాదని, ఏకంగా ఇంటర్నేషనల్ సబ్జెక్ట్ అని ఆయన ఉద్వేగంగా పేర్కొన్నారు.
ఏప్రిల్ 2 నుంచి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్.. అవార్డుల హవా!
థియేట్రికల్ రన్ ముగించుకున్న ‘యూఫోరియా’ గురువారం (ఏప్రిల్ 2) నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా 'ప్రీ స్ట్రీమింగ్ సెలబ్రేషన్స్' పేరుతో నిర్వహించిన ప్రెస్ మీట్లో గుణశేఖర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
తెలంగాణ ప్రభుత్వం 'యూఫోరియా' కంటెంట్ను గుర్తించి రెండు ప్రతిష్టాత్మక అవార్డులను అందించిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఉత్తమ కథారచయితగా తనకు, ఉత్తమ సహాయనటిగా భూమికకు దక్కిన ఈ గౌరవం పట్ల గర్వపడుతున్నానన్నారు.
అయితే, అంతకంటే ఎక్కువ గుర్తింపు ఈరోజు ఈటీవీ విన్ సంస్థ ఇచ్చిందని, తమ ప్లాట్ఫామ్పై ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయడం అత్యంత సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.
'బోల్డ్' కంటెంట్ అనగానే ఓటీటీలు వణికిపోయాయి!
కంటెంట్ అంటే బోల్డ్ గా ఉండాలి కదా అని మాట్లాడుకుంటున్న ఈ రోజుల్లో.. ఒకటి రెండు ఓటీటీ సంస్థలు మాత్రం తన సినిమాను చూసి సంశయించాయని గుణశేఖర్ అసలు నిజాలు బయటపెట్టారు.
సాధారణంగా థియేటర్లలో సినిమాకు సెన్సార్ అడ్డుకట్ట ఉంటుంది కానీ, ఓటీటీ సంస్థలకు ఆ భయం ఉండదు, బోల్డ్ కంటెంట్ను ఎంకరేజ్ చేస్తుంటారు. కానీ, 'యూఫోరియా' విషయంలో మాత్రం సినిమా చాలా బాగుందని చెబుతూనే.. "తెలుగులో ఇంత నిర్భయంగా, నగ్న సత్యాన్ని ఇలా చూపించారు ఏంటి?" అని ఆ ఓటీటీ సంస్థలు షాక్ అయ్యాయట.
బోల్డ్ అంటే విజువల్స్ కాదని, చెప్పే కంటెంట్ లో ఉండాలని గుణశేఖర్ స్పష్టం చేశారు. ఆ రోజుల్లో వచ్చిన 'ప్రతిఘటన' సినిమాలో 'దుర్యోధన దుశాసన' పాటకు థియేటర్లు షేక్ అయ్యాయని, ఆ తర్వాత తేజ 'చిత్రం', 'మయూరి', 'మౌన పోరాటం' లాంటి ఆలోచింపజేసే సినిమాలు సమాజంలో జరిగే సంఘటనల ఆధారంగానే వచ్చాయని ఆయన గుర్తుచేశారు.
ఆ స్ఫూర్తితోనే, నిజ జీవిత సంఘటనల ఆధారంగా తాను 'యూఫోరియా'ను తెరకెక్కించానని వివరించారు. "నేనొక కథను చెప్పాలనుకున్నాను.. కేవలం సినిమా తీయాలనుకోలేదు. నాలాంటి దర్శకుడిని దయచేసి ఎంకరేజ్ చేయండి" అని గుణశేఖర్ ఎమోషనల్ అయ్యారు.
ఇండస్ట్రీదే మహా పాపం.. ఓటీటీ మాయలో పడిపోయాం!
సినిమా థియేటర్లలో ఆడకపోవడానికి ప్రేక్షకులది ఏమాత్రం తప్పు లేదని, ఇది పూర్తిగా సినిమా పరిశ్రమ చేసుకున్న స్వయంకృతాపరాధమేనని గుణశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ తర్వాత పుట్టుకొచ్చిన ఓటీటీ భూతం సినిమాను పూర్తిగా కబళించేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఓటీటీ సంస్థలు కోట్లు ఆఫర్ చేస్తుంటే ఆ మాయలో పడిపోయి డబ్బులు దోచేసుకున్నామని, థియేటర్లలో రిలీజైన నెల రోజులకే సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుందనే అలవాటును ఆడియన్స్కు మనమే చేశామని ఆయన మండిపడ్డారు.
"అలాంటప్పుడు ఆడియన్స్ ఎందుకు థియేటర్కి వస్తారు? పెద్ద హీరోల సినిమాలు థియేటర్లలో చూసి, ఇలాంటి కంటెంట్ సినిమాలు ఓటీటీలో చూద్దామని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు" అని ఆయన కుండబద్దలు కొట్టారు.
మూడు నెలల నిబంధన వస్తేనే సినిమా బతుకుతుంది!
ప్రస్తుతం థియేటర్లలో రిలీజైన సినిమా కేవలం 4 వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోందని, ఆ చెత్త విధానాన్ని వెంటనే బ్రేక్ చేయాలని గుణశేఖర్ డిమాండ్ చేశారు.
కనీసం 3 నెలల వరకు ఏ సినిమా కూడా ఓటీటీలోకి రాకుండా కఠిన నిబంధనలు తీసుకురావాలని, అప్పుడే సినిమా బతుకుతుందని ఆయన స్పష్టం చేశారు. అప్పుడు మాత్రమే ప్రేక్షకులు కదిలి థియేటర్లకు వస్తారన్నారు.
ఇప్పుడు ఓటీటీ సంస్థల తీరు కూడా మారిందని, థియేట్రికల్ రన్ బాగుంటేనే సినిమాలు కొంటున్నారని ఆయన తెలిపారు. "అసలు థియేట్రికల్ మార్కెట్టే చంపేసి, ఇప్పుడు థియేటర్లలో ఆడాలంటే ఎలా? సినిమా బతకాలంటే ఓటీటీ గడువును కనీసం మూడు నెలలు చేసి తీరాల్సిందే!" అని గుణశేఖర్ తన ప్రసంగాన్ని ముగించారు.
రంగుల వెండితెర వెనుక రగులుతున్న అసలు సమస్యను గుణశేఖర్ అత్యంత నిర్భయంగా బయటపెట్టారు. 4 వారాల ఓటీటీ వ్యసనం నుంచి ఇండస్ట్రీ బయటపడకపోతే.. భవిష్యత్తులో థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకమే అని ఆయన చేసిన ఈ హెచ్చరిక టాలీవుడ్ను మేల్కొల్పుతుందో లేదో చూడాలి!
Also Read:
స్టార్ ఇమేజ్పై ఎఫెక్ట్: సినిమా రిలీజ్ డేట్స్ వెనుక అసలు గేమ్ ఇదే!ధురంధర్ 2 వసూళ్ల సునామీ: బాలీవుడ్పై ఆర్జీవీ ఫైర్! రూ.2000 కోట్ల టార్గెట్
అనుమతి లేకుండా షూటింగ్.. నటుడు రాహుల్ మృతిపై పోలీసుల షాకింగ్ నిజాలు!
ప్రముఖ నటుడు రాహుల్ అరుణోదయ్ బెనర్జీ జలసమాధి!
ధురంధర్ 2: రణ్వీర్, ముస్తఫాల సీక్రెట్ సీన్ వెనుక అసలు కథ!

