బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. 'ఓం శాంతి ఓం' సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన దీపికా, మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుస హిట్లతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అయితే, గత కొంతకాలంగా ఈ అమ్మడు తరచూ వివాదాల్లో చిక్కుకుంటోంది. బిడ్డ పుట్టిన తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న దీపికా, ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది.
ఈ క్రమంలోనే, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రాబోతున్న 'స్పిరిట్' సినిమాలో దీపికా నటించనుందని వార్తలు వచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల ఆమెను తప్పించి, ఆమె స్థానంలో త్రిప్తి డిమ్రిని తీసుకున్నారని టాక్ వినిపించింది. అయితే, నిన్న సందీప్ రెడ్డి వంగా చేసిన సంచలన ట్వీట్తో మరోసారి దీపికా పేరు తెరపైకి వచ్చింది.
దీపికా వ్యాఖ్యలు వైరల్
తాజాగా దీపికా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఎప్పుడూ తన మనసు చెప్పేదే వింటానని దీపికా అన్నారు. ఇటీవల ఓ ఫ్యాషన్ షోలో పాల్గొన్న దీపికా, మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. జీవితంలో బ్యాలెన్స్ ఉండాలంటే నిజాయితీ చాలా ముఖ్యమని, దానికే తాను ప్రాధాన్యత ఇస్తానని చెప్పింది. కష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు తన మనసు చెప్పేదే వింటానని, ఆ తర్వాతే నిర్ణయాలు తీసుకుంటానని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటానని దీపికా వివరించింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
గత రెండు రోజులుగా దీపికా పేరు నెట్టింట మారుమోగుతోంది. ఇటీవల దీపికాకు సంబంధించిన పీఆర్ టీం 'స్పిరిట్' సినిమా కథను లీక్ చేసిందని ప్రచారం నడిచింది. అందుకే డైరెక్టర్ సందీప్ రెడ్డి దీటుగా కౌంటర్ ఇస్తూ నిన్న ట్వీట్ చేసినట్లు నెటిజన్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దీపికా మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.
మీరు దీపికా పదుకొణె వ్యాఖ్యలపై ఏమనుకుంటున్నారు?