పెళ్లయి, ఇద్దరు పిల్లలున్న ఒక మహిళ, విడాకులు తీసుకున్న ఓ యువకుడు... ఈ ఇద్దరినీ కలిపింది ఫేస్బుక్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని అశోక్నగర్కు చెందిన ఆమె, భూపాలపల్లి జిల్లా దమ్మన్నపేట గ్రామానికి చెందిన అతను.. వీరిద్దరి మధ్య ఫేస్బుక్లో మొదలైన పరిచయం క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీసింది.
భర్త, పిల్లలు ఉన్నారనే సంగతిని పూర్తిగా పక్కన పెట్టిన ఆ మహిళ, తన ఫేస్బుక్ ప్రియుడిని ఏకంగా తన ఇంటికే రప్పించుకోవడం మొదలుపెట్టింది. ఇది తప్పు, ఇలా చేయడం మంచిది కాదని ఆ వీధిలోని స్థానికులు ఎన్నోసార్లు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. భర్త కూడా పలుమార్లు హెచ్చరించినా ఆమె తీరు మారకపోవడంతో విసిగిపోయి హైదరాబాద్ వెళ్లిపోయాడు.
ఇక అడ్డు చెప్పేవారు ఎవరూ లేకపోవడంతో, ఆ మహిళ తన ఫేస్బుక్ ప్రియుడిని శాశ్వతంగా తన ఇంట్లోనే ఉంచుకుంది. చాలా రోజులుగా ఈ బాగోతాన్ని గమనిస్తున్న కాలనీవాసులు, ఎట్టకేలకు వీరిద్దరినీ రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆగ్రహంతో వారిద్దరినీ చితకబాది, బోరింగ్కు కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించగా, వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు.