పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస చిత్రాలతో తీరిక లేకుండా ఉన్నారు. ఇప్పటికే దర్శకుడు మారుతితో 'రాజాసాబ్', హను రాఘవపూడి దర్శకత్వంలో మరో భారీ చిత్రం షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ రెండు ప్రాజెక్టులపై భారీ అంచనాలు నెలకొనగా, అంతకుమించి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్న 'స్పిరిట్' చిత్రంపై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఈ సినిమా ప్రకటన వెలువడినప్పటి నుంచీ, రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది, ముఖ్యంగా కథానాయిక ఎవరు అనే చర్చ ఆసక్తిగా సాగుతోంది.
'స్పిరిట్'లో త్రిప్తి డిమ్రి - రూమర్స్కు చెక్!
ఇంతకుముందు 'స్పిరిట్'లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె నటిస్తుందని, ఆమెతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు కనిపించనున్నారని వార్తలు వచ్చాయి. ఇటీవల దీపికాను ఈ ప్రాజెక్ట్ నుంచి తొలగించారనే ప్రచారం కూడా ఊపందుకుంది. అయితే, ఈ రూమర్స్కు చెక్ పెడుతూ, 'స్పిరిట్' మూవీ మేకర్స్ అధికారికంగా కథానాయికను ప్రకటించారు.
ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రాబోతున్న 'స్పిరిట్' చిత్రంలో బాలీవుడ్ యువనటి త్రిప్తి డిమ్రి నటించనున్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ, 'స్పిరిట్' అన్ని భాషల్లో విడుదలయ్యే పోస్టర్లలో ఆమె పేరును ప్రముఖంగా ప్రచురించారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన 'యానిమల్' సినిమాలో చిన్న పాత్రలో కనిపించినా, త్రిప్తి నేషనల్ లెవల్లో అనూహ్యమైన క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడు మరోసారి సందీప్ రెడ్డి ఆమెకు భారీ అవకాశం ఇచ్చారు. 'యానిమల్'తో ఇండియా వైడ్గా బలమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న త్రిప్తి, ఇప్పుడు ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్తో కలిసి నటించడం ద్వారా తన క్రేజ్ను మరింత పెంచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
'స్పిరిట్' - ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ అవతార్!
'స్పిరిట్' చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనడానికి మరో ప్రధాన కారణం - ఈ చిత్రంలో ప్రభాస్ తొలిసారిగా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. దీంతో ఈ మూవీ కోసం అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి 'స్పిరిట్' రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.