Gold Reserves 2026: అమ్ముతున్న రష్యా, కొంటున్న భారత్

naveen
By -
A cinematic visual showing shiny gold bars with flags of India, Russia, and Turkey, representing the global shift in gold reserves during war times


సామాన్యుడి కంటికి బంగారం అంటే కేవలం పెళ్లిళ్లలో మెరిసే ఆభరణం.. లేదా మురిపించే పెట్టుబడి! కానీ, అదే బంగారం ఇప్పుడు ప్రపంచ దేశాల తలరాతలను మార్చేస్తున్న ఒక భయంకరమైన బ్రహ్మాస్త్రం అని మీకు తెలుసా? యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ.. ఒకవైపు పవర్ ఫుల్ దేశాలు తమ దగ్గర ఉన్న పసిడిని అగ్గువకు అమ్మేసుకుంటూ ఉంటే, మన భారతదేశం మాత్రం సైలెంట్ గా బంగారు కోటను నిర్మిస్తోంది. అసలు గ్లోబల్ మార్కెట్ లో ఈ 'గోల్డ్ వార్' ఎందుకు జరుగుతోంది? ఈ పసిడి వేట సామాన్యుడి జేబుపై, దేశాల భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపబోతోందన్న ఉత్కంఠభరిత కథే ఈ ప్రత్యేక కథనం!


యుద్ధం తెచ్చిన సరికొత్త మార్పు.. తెరవెనుక ఏం జరుగుతోంది?


ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు ఎప్పుడూ తమ విదేశీ మారక ద్రవ్య నిల్వలను పటిష్టం చేసుకోవడానికి బంగారాన్ని కొనుగోలు చేస్తుంటాయి. అది ఒకప్పటి ముచ్చట! కానీ, 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఒక ఆసక్తికరమైన, సంచలన ధోరణి గ్లోబల్ స్క్రీన్ పైకి వచ్చింది.


ఒకవైపు భారత్, చైనా లాంటి దేశాలు పసిడి నిల్వలను పోటీ పడి మరీ పెంచుకుంటుంటే.. భౌగోళిక రాజకీయాల చదరంగంలో, యుద్ధంలో చిక్కుకున్న కొన్ని దేశాలు మాత్రం తమ నిల్వలను గుట్టుచప్పుడు కాకుండా అమ్ముకుంటున్నాయి. ఒకప్పుడు అత్యంత సురక్షితమైన పెట్టుబడిగా భావించిన బంగారాన్ని ఇప్పుడు తమ ఆర్థిక అవసరాల కోసం, ముఖ్యంగా యుద్ధ వ్యయాల కోసం విక్రయిస్తుండటం గమనార్హం.


రష్యా వెనకడుగు.. కరిగిపోతున్న పసిడి కోట!


ఇటీవలి నివేదికల ప్రకారం.. మూడు ప్రధాన దేశాలు తమ పసిడి నిల్వలను విక్రయించడం లేదా భారీగా తగ్గించుకోవడం చేస్తున్నాయి. అందులో మొదటిది రష్యా. ఉక్రెయిన్‌తో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న భీకర యుద్ధం కారణంగా రష్యా ఊపిరాడక అల్లాడుతోంది. తప్పనిసరి పరిస్థితుల్లో తన పసిడి నిల్వలను విక్రయించక తప్పడం లేదు.


యుద్ధ వ్యయాలను భరించడానికి, పాశ్చాత్య దేశాల ఆర్థిక ఆంక్షల ఉచ్చు నుంచి బయటపడటానికి రష్యా 2025 నుండి నిరంతరంగా బంగారాన్ని విక్రయిస్తోంది. దీని దెబ్బకు ఫిబ్రవరి 2026 నాటికి రష్యా పసిడి నిల్వలు ఏకంగా నాలుగేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయాయి. అంటే సుమారు 2,327 టన్నులకు ఈ నిల్వలు పడిపోయినట్లు తాజా లెక్కలు చెబుతున్నాయి.


టర్కీ, పోలాండ్.. మార్కెట్లో అసలు ట్విస్ట్!


ఇక ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల దెబ్బకు టర్కీ దేశం కూడా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. తన కరెన్సీ అయిన 'లిరా' విలువ పాతాళానికి పడిపోకుండా కాపాడుకోవడానికి టర్కీ ఏకంగా 60 టన్నుల బంగారాన్ని మార్కెట్లో విక్రయించినట్లు సమాచారం. దీని విలువ అక్షరాలా 8 బిలియన్ డాలర్లు!


మరోవైపు గతంలో పసిడి కొనుగోళ్లలో అగ్రస్థానంలో ఉంటూ అందరినీ ఆశ్చర్యపరిచిన పోలాండ్ దేశం సైతం ఇప్పుడు తన రూట్ మార్చింది. తన రక్షణ బడ్జెట్ కోసం అత్యవసరంగా ఆ పసిడి నిల్వలను వినియోగించుకోవాలని యోచిస్తోంది.


రికార్డుల రారాజుగా భారత రిజర్వ్ బ్యాంక్!


ప్రపంచవ్యాప్తంగా ఇంతటి భయంకరమైన అనిశ్చితి, యుద్ధ భయాలు ఉన్నప్పటికీ.. మన భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) మాత్రం పసిడి నిల్వలను భారీగా పెంచుకుంటూ పోతోంది.


భారత రిజర్వ్ బ్యాంక్ వద్ద ప్రస్తుతం 880.18 టన్నుల పసిడి నిల్వలు అత్యంత భద్రంగా ఉన్నాయి. దీని విలువ ఫిబ్రవరి 2026 నాటికి రికార్డు స్థాయిలో 131.63 బిలియన్ డాలర్లకు చేరడం భారతీయులందరికీ గర్వకారణం!


యుద్ధాలు దేశాల ముఖచిత్రాన్నే కాదు, ఆర్థిక వ్యవస్థల రూపురేఖలను సైతం ఎలా మార్చేస్తాయో అనడానికి ఈ గోల్డ్ రష్ ఒక ప్రత్యక్ష నిదర్శనం. రష్యా, టర్కీ లాంటి దేశాలు తమ ఉనికి కోసం బంగారాన్ని కరిగిస్తుంటే.. భారత్ మాత్రం ముందుచూపుతో పసిడిని పోగేసుకుంటూ భవిష్యత్తుకు కొండంత భరోసా ఇస్తోంది. సామాన్యులు కూడా ఈ గ్లోబల్ ట్రెండ్‌ను గమనించి పసిడిపై పెట్టుబడులు కొనసాగించడం అత్యంత సురక్షితమైన మార్గం!



Tags: