2025లో ఆర్థిక విపత్తు: బాబా వంగా జోస్యం నిజమవుతోందా?

surya
By -
0

భవిష్యత్తులో సంభవించే పెను విపత్తులు, ప్రమాదాలు మరియు సంఘటనలను ముందుగానే అంచనా వేసిన బాబా వంగా గురించి చాలా మందికి తెలిసి ఉంటుంది. బల్గేరియాకు చెందిన ఈమె తన జీవిత కాలంలో భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలను అంచనా వేసింది. ఆమె చెప్పిన సంవత్సరాల్లో చాలా విషయాలు నిజం కావడంతో అనేక మంది బాబా వంగాను నమ్ముతారు. అయితే, ప్రపంచ ప్రసిద్ధి చెందిన బాబా వంగా 2025వ సంవత్సరానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంచనాలు వేశారు. భారీ భూకంపాలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని ఆమె పేర్కొన్నారు. ఆమె చెప్పినట్లుగానే ఇటీవల మయన్మార్ మరియు థాయ్‌లాండ్‌లో భారీ భూకంపాలు సంభవించాయి. మార్చి 28న మయన్మార్‌ను 7.7 తీవ్రతతో భూకంపం తాకింది, దీనివల్ల 2,700 మందికి పైగా మరణించారు. భూకంపాలతో పాటు ఈ సంవత్సరం ఆర్థిక విపత్తు కూడా సంభవిస్తుందని బాబా వంగా అంచనా వేశారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న టారిఫ్ యుద్ధాన్ని చూస్తుంటే, బాబా వంగా చెప్పినట్లే జరుగుతోందని అనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇతర దేశాలపై టారిఫ్ యుద్ధం ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. ఇప్పటికే అనేక మంది బిలియనీర్ల సంపద ఆవిరైపోయింది. ఏప్రిల్ 5 నుండి అమల్లోకి వచ్చిన 10 శాతం ప్రాథమిక సుంకాన్ని ట్రంప్ విధించిన తర్వాత ఇది జరిగింది. దీనిని ఆయన చారిత్రాత్మక చర్యగా అభివర్ణించారు. అమెరికాతో అధిక వాణిజ్య లోటు ఉన్న దాదాపు 60 దేశాలు లేదా ట్రేడింగ్ బ్లాక్‌ల నుండి అమెరికాలోకి ప్రవేశించే వస్తువులపై అధిక సుంకాలు విధించారు. చైనాపై 34 శాతం కొత్త సుంకాలు, యూరోపియన్ యూనియన్‌పై 20 శాతం కొత్త సుంకాలు విధించారు. అమెరికా-మెక్సికో-కెనడా ఒప్పందానికి అనుగుణంగా లేని మెక్సికో మరియు కెనడా వస్తువులపై 25 శాతం సుంకం విధించారు.

ట్రంప్ చర్య చైనా మరియు యూరోపియన్ యూనియన్ నుండి ప్రతీకార సుంకాలను ప్రేరేపించింది. అమెరికన్ వస్తువులపై 34 శాతం సుంకాన్ని విధిస్తున్నట్లు చైనా ప్రకటించింది. ఇది ట్రంప్‌కు ఆగ్రహం తెప్పించింది, ప్రతీకార సుంకాలను ఉపసంహరించుకోకపోతే చైనాపై అదనంగా 50 శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. అయినా చైనా వెనక్కి తగ్గకపోవడంతో అమెరికా 50 శాతం అదనపు సుంకాలను పెంచింది, మొత్తం సుంకాలు 104 శాతానికి చేరుకున్నాయి. దీంతో గురువారం నుండి అన్ని అమెరికన్ వస్తువులపై 84 శాతం సుంకాలు విధిస్తున్నట్లు చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

ఇలా రెండు అతి పెద్ద దేశాలు సుంకాలు పెంచుకుంటూ పోతుంటే, ప్రపంచ వాణిజ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీన్ని ఆర్థిక విపత్తుగా ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ టారిఫ్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో మరింత ఒడిదుడుకులకు దారితీసింది. ఈ క్రాష్ కారణంగా బిలియనీర్లు మార్కెట్లో ట్రిలియన్ల డాలర్లను కోల్పోయారు. ఇలా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, ఈ టారిఫ్ యుద్ధం ఎక్కడికి దారితీస్తుందో అని ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే, కొన్ని రోజుల్లోనే ప్రపంచం మొత్తం ఆర్థిక సమస్యలతో అతలాకుతలం అవ్వడం, వస్తువుల ధరలు భారీగా పెరగడం, అధిక ద్రవ్యోల్బణం వంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. మరి ఇవన్నీ చూస్తుంటే, బాబా వంగా చెప్పింది చెప్పినట్లు కనిపిస్తోంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!