సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళితో కలిసి ఒక భారీ ప్రాజెక్ట్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మూడు షెడ్యూల్స్ చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం తదుపరి షెడ్యూల్ కోసం హైదరాబాద్లో భారీ సెట్ నిర్మాణం జరుగుతోంది.
మహేష్ బాబుకు కాస్త సమయం దొరికితే చాలు, వెంటనే విదేశాలకు విహారయాత్రకు వెళ్ళిపోతుంటారు. అయితే, రాజమౌళి ఈ సినిమా ప్రారంభించే ముందు మహేష్ బాబు పాస్పోర్ట్ను తీసుకున్నట్లు ఒక సరదా పోస్ట్ పెట్టారు. సినిమా పూర్తయ్యే వరకు మహేష్ ఎలాంటి వెకేషన్కు వెళ్లలేడని రాజమౌళి పరోక్షంగా ఆ పోస్ట్తో చెప్పారు. అభిమానులు కూడా అదే నమ్మారు. సాధారణంగా రాజమౌళి సినిమా అంటే హీరోలు ఆయన చెప్పినట్లుగా నడుచుకోవాల్సిందే. కానీ, మహేష్ సినిమా విషయంలో అవన్నీ మారినట్లు కనిపిస్తున్నాయి. మహేష్ తనకు నచ్చినట్లుగా వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్నాడు మరియు బయట కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నాడు.
తాజాగా, మహేష్ బాబు ఇప్పుడు వెకేషన్కు కూడా వెళ్తున్నారు. ఈరోజు మహేష్ బాబు విమానాశ్రయంలో కనిపించారు. అక్కడ ఉన్న కెమెరామెన్లు ఫోటోలు తీస్తుండగా, మహేష్ వారికి తన పాస్పోర్ట్ను చూపించారు. దీంతో రాజమౌళి వద్ద నుంచి మహేష్ బాబు తన పాస్పోర్ట్ను తిరిగి తీసుకున్నారని, ఆయన వెకేషన్కు వెళ్ళిపోతున్నారని స్పష్టంగా తెలుస్తోంది. మహేష్ తన కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లినట్లు సమాచారం.
తదుపరి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమయ్యేలోపు ఒక చిన్న విరామం తీసుకోవాలని మహేష్ వెళ్ళిపోయారు. అయితే, సాధారణంగా ఏ హీరోకి సాధ్యం కాని విషయాలు రాజమౌళి వద్ద మహేష్ బాబుకు సాధ్యమవుతుండటం చూసి ఆయన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం మహేష్ పాస్పోర్ట్ చూపిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Finally superstar @urstrulyMahesh got his passport from @ssrajamouli 😉
— ☆ Loyal Maheshians ☆ (@LoyalMaheshians) April 5, 2025
Off to Vaccination ✨️😌#SSMB29 #MaheshBabu pic.twitter.com/yhJEBYNRR2

