అరెకరం భూమితోనే లక్షల్లో లాభం! మాజీ సీఎం కేసీఆర్ కూడా ఈ పంటనే నమ్ముకున్నారు.
సాగు అందరూ చేస్తారు, కానీ మార్కెట్కు తగ్గట్టు ఏ పంటకు మంచి ధర ఉంటుందో అంచనా వేసి, ప్లానింగ్తో కొందరు మాత్రమే ట్రెండీ పంటను సాగుచేస్తారు. అలాంటి వాళ్లే అరెకరం భూమితో కూడా భారీగా సంపాదిస్తారు. ముఖ్యంగా యువ రైతులకు ఈ ఐడియా బాగా నచ్చే అవకాశం ఉంది.
క్యాప్సికం.. రంగును బట్టి రేటు!
మన దేశంలో క్యాప్సికం సాగు వేగంగా విస్తరిస్తోంది. ఆకుపచ్చ, పసుపు, ఎరుపు రంగు క్యాప్సికంలో వీటికి మార్కెట్లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. మార్కెట్ డిమాండ్ను బట్టి రైతు తమకు నచ్చిన రంగును ఎంపిక చేసుకోవచ్చు.
ఆకుపచ్చ క్యాప్సికానికి ధర కాస్త తక్కువే అయినా, అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. అదే ఎర్ర క్యాప్సికానికి ధర చాలా ఎక్కువ. రైతులు ఒకే పొలంలో మూడు రకాల క్యాప్సికం పండించడం ద్వారా ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నా నష్టపోకుండా లాభం పొందవచ్చు.
కేసీఆర్ ఫామ్హౌస్లో కూడా ఇదే సాగు!
తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంత వాసులు ఈ పంటను ఎక్కువగా పండిస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ కూడా తన ఫామ్హౌజ్లో క్యాప్సికం సాగు చేసి, విదేశాలకు ఎగుమతి చేసినట్లు సమాచారం.
అరెకరం ఖర్చు.. లక్షల్లో లాభం!
ఒక అంచనా ప్రకారం, అర ఎకరం భూమిలో క్యాప్సికం సాగు చేయడానికి రూ.15,000 నుండి రూ. 20,000 వరకు ఖర్చవుతుంది. కానీ, పంట పూర్తయ్యే సరికి రూ.1 లక్ష నుండి రూ.1.5 లక్షల వరకు నికర లాభం వస్తుంది. ఇది సాంప్రదాయ పంటలతో పోలిస్తే చాలా ఎక్కువ రాబడి.
సాగు విధానం.. రెండు నెలల్లోనే పంట
క్యాప్సికం సాగు ప్రారంభించడానికి ముందు, భూమిని లోతుగా దున్ని, ఆవు పేడ, వర్మీ కంపోస్ట్తో కలిపిన ఎరువులు వేయాలి. అనంతరం గట్లు తయారు చేసి, వాటిపై ప్లాస్టిక్ మల్చింగ్ షీట్లు వేయాలి. ఆ షీట్లలో క్రమంగా రంధ్రాలు చేసి మొక్కలను నాటాలి.
నాటిన తర్వాత క్రమం తప్పకుండా నీటిపారుదల అందిస్తే, కేవలం రెండు నెలల్లోనే పంట చేతికి వస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఎరుపు క్యాప్సికం కిలో ధర రూ.100 వరకు, ఆకుపచ్చ క్యాప్సికం రూ.40 నుంచి రూ.60 వరకు పలుకుతోంది.
సాంప్రదాయ పద్ధతులకు స్వస్తి చెప్పి, మార్కెట్ ట్రెండ్కు అనుగుణంగా క్యాప్సికం వంటి పంటలను సాగు చేస్తే, తక్కువ భూమి ఉన్న యువ రైతులు కూడా అధిక లాభాలను ఆర్జించవచ్చనడానికి ఇదే నిదర్శనం.

