బాలయ్య అభిమానులకు పండగ లాంటి వార్త! కోర్టు చిక్కులు వీడిపోతున్నాయి.. 'అఖండ 2' గర్జన వినబడే ముహూర్తం ఖరారైనట్లే. అసలు సినిమా ఎందుకు ఆగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ 'అఖండ 2' (Akhanda 2) కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. అయితే, అనుకున్న సమయానికి సినిమా రాకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర అసహనానికి గురయ్యారు. ఎట్టకేలకు ఆ ఉత్కంఠకు తెరపడనుంది.
డిసెంబర్ 12న థియేటర్లలోకి?
తాజా సమాచారం ప్రకారం, సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది.
కోర్టు ఆర్డర్: సినిమా విడుదలకు సంబంధించిన కోర్టు ఆర్డర్ రేపటికల్లా (బుధవారం) మేకర్స్ చేతికి వచ్చే అవకాశం ఉంది.
రిలీజ్ డేట్: ఆర్డర్ వచ్చిన వెంటనే అధికారిక ప్రకటన రానుంది. మేకర్స్ వచ్చే వారమే, అంటే డిసెంబర్ 12న సినిమాను గ్రాండ్గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
మరో రెండు రోజుల్లో 14 రీల్స్ ప్లస్ సంస్థ నుంచి డేట్ అనౌన్స్మెంట్ పోస్టర్ వచ్చే ఛాన్స్ ఉంది.
అసలు గొడవ టెక్నికల్ కాదు.. ఫైనాన్షియల్!
'అఖండ 2' వాయిదా పడటానికి కారణం గ్రాఫిక్స్ పనులో, టెక్నికల్ సమస్యలో కాదు. దీని వెనుక పాత అప్పుల గొడవ ఉంది.
పాత సినిమాలు: గతంలో ఇదే నిర్మాతలు (రామ్, గోపి) '14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్' బ్యానర్పై మహేష్ బాబుతో '1 నేనొక్కడినే', 'ఆగడు' సినిమాలు తీశారు. ఇవి బాలీవుడ్ నిర్మాణ సంస్థ 'ఈరోస్ నౌ' (Eros Now) భాగస్వామ్యంతో నిర్మించినవి.
రూ. 27 కోట్ల బాకీ: ఆ రెండు సినిమాలు ప్లాప్ అవ్వడంతో ఆర్థిక లావాదేవీల సమస్య తలెత్తింది. ఈరోస్ నౌకు నిర్మాతలు సుమారు రూ. 27.8 కోట్లు బాకీ పడ్డారు.
కోర్టు కేసు: ఈ అప్పు చెల్లించకుండా వారు '14 రీల్స్ ప్లస్' అనే కొత్త బ్యానర్ పెట్టి సినిమాలు తీస్తున్నారు. దీంతో ఇన్నాళ్లు సైలెంట్గా ఉన్న ఈరోస్ సంస్థ, సరైన సమయం చూసి మద్రాస్ హైకోర్టులో కేసు వేసింది. తీర్పు ఈరోస్కు అనుకూలంగా రావడంతో సినిమా రిలీజ్ ఇన్నాళ్లు ఆగింది. ఇప్పుడు ఆ సమస్య కొలిక్కి రావడంతో బాలయ్య సినిమా రిలీజ్కు రెడీ అవుతోంది.

