IND vs ZIM Match: మ్యాచ్ టికెట్ ఉంటే చెన్నై మెట్రో ఫ్రీ

naveen
By -

క్రికెట్ మ్యాచ్ అనగానే సామాన్యుడికి ముందుగా గుర్తొచ్చేది ట్రాఫిక్ నరకం, పార్కింగ్ కోసం ఆటో వాళ్లతో, క్యాబ్ వాళ్లతో పడే పాట్లు. వేలు పోసి టికెట్ కొన్నా.. స్టేడియం చేరుకునేసరికి సగం ప్రాణం పోతుంది. కానీ, ఈరోజు (ఫిబ్రవరి 26) చెన్నైలో జరుగుతున్న ఇండియా - జింబాబ్వే మ్యాచ్‌కు వెళ్లే ప్రేక్షకులకు మాత్రం ఈ కష్టాలేవీ లేవు. మీ దగ్గర మ్యాచ్ టికెట్ ఉంటే చాలు.. చెన్నై మెట్రోలో ప్రయాణం పూర్తిగా ఉచితం!


ఒక వైపు టీమిండియాకు ఇది చావో రేవో తేల్చుకునే డూ ఆర్ డై మ్యాచ్ కాగా.. మరోవైపు ట్రాఫిక్ కష్టాలు లేకుండా అభిమానులను స్టేడియానికి చేర్చేందుకు చెన్నై మెట్రో రైల్ (CMRL) తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. అసలు ఈ ఉచిత ప్రయాణం ఎలా చేయాలి? ఈ సిస్టమ్ వల్ల సామాన్యుడికి ఒరిగేదేంటి?


IND vs ZIM Match


అసలేంటి ఈ ఉచిత మెట్రో ఆఫర్?


చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో నేడు సూపర్-8 మ్యాచ్ జరగనుంది. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (TNCA) తో ఒప్పందం చేసుకున్న చెన్నై మెట్రో.. మ్యాచ్ రోజున అభిమానుల క్రికెట్ టికెట్లనే మెట్రో టికెట్లుగా మార్చేసింది.


ఈ ప్రయాణ ఖర్చును మొత్తం ఈవెంట్ నిర్వాహకులే భరిస్తారు. ఏ మెట్రో స్టేషన్ నుంచైనా గవర్నమెంట్ ఎస్టేట్ స్టేషన్ (స్టేడియం దగ్గర్లోని స్టేషన్) కు వెళ్లి, తిరిగి రావడానికి ఒక రౌండ్ ట్రిప్ ఉచితంగా అందిస్తున్నారు.


ఈ నిర్ణయం వల్ల లాభాలు


సామాన్య ప్రేక్షకుడి కోణంలో ఆలోచిస్తే ఈ నిర్ణయం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అవేంటంటే:


  • ట్రాఫిక్ ఫ్రీ: వేలాది మంది ఒకేసారి రోడ్ల మీదకు రాకుండా మెట్రోలో వెళ్లడం వల్ల సిటీలో ట్రాఫిక్ జామ్స్ ఉండవు.
  • డబ్బు ఆదా: పార్కింగ్ మాఫియా, క్యాబ్ డ్రైవర్ల సర్జ్ ప్రైసింగ్ (Surge Pricing) దోపిడీ నుంచి సామాన్యుడికి విముక్తి.
  • పర్యావరణ హితం: వ్యక్తిగత వాహనాల వాడకం తగ్గడం వల్ల కాలుష్యం తగ్గుతుంది.


ఉచిత ప్రయాణం ఎలా చేయాలి? 


ఈ ఫ్రీ మెట్రో సేవలను వినియోగించుకోవడం చాలా సులువు. మీరు పెద్దగా కష్టపడాల్సిన పన్లేదు.


మీ దగ్గర ఉన్న ఇండియా - జింబాబ్వే మ్యాచ్ టికెట్ (ఫిజికల్ లేదా డిజిటల్) తీసుకోండి.


అందులో ఉన్న ప్రత్యేకమైన క్యూఆర్ (QR) కోడ్‌ను మెట్రో స్టేషన్ ఎంట్రీ గేట్ల వద్ద ఉన్న స్కానర్ దగ్గర స్కాన్ చేయండి.


గేట్ ఓపెన్ అవ్వగానే లోపలికి వెళ్లి రైలు ఎక్కేయడమే. తిరిగి వచ్చేటప్పుడు కూడా ఇదే ప్రాసెస్.


టైమింగ్స్.. అర్ధరాత్రి వరకు సేవలు


మ్యాచ్ ముగిశాక రాత్రి పూట ఇళ్లకు వెళ్లేందుకు ఇబ్బంది పడకుండా, గురువారం రాత్రి మెట్రో సేవలను అర్ధరాత్రి 12 గంటల వరకు పొడిగించారు. గవర్నమెంట్ ఎస్టేట్ స్టేషన్ నుంచి విమ్కో నగర్ వైపు, ఎయిర్‌పోర్ట్ లైన్ వైపు చివరి రైళ్లు బయలుదేరుతాయి.


ప్రయాణికులకు షరతులు 


ఉచితమే కదా అని ఇష్టమొచ్చినట్లు వెళ్లడానికి లేదు. కొన్ని రూల్స్ పాటించాలి.


రాత్రి 11 గంటల తర్వాత గ్రీన్ లైన్‌కు మారాల్సిన ప్రయాణికులు.. కేవలం 'చెన్నై సెంట్రల్ స్టేషన్' లోనే మార్పిడి చేసుకోవాలి.


చివరి రైలు బయలుదేరే సమయానికి సరిగ్గా 10 నిమిషాల ముందే 'గవర్నమెంట్ ఎస్టేట్ స్టేషన్' లోపలికి ప్రవేశాన్ని (ఎంట్రీ) మూసివేస్తారు. కాబట్టి మ్యాచ్ అవ్వగానే త్వరగా స్టేషన్ కు చేరుకోవాలి.


చావో రేవో మ్యాచ్.. గెలిస్తేనే సెమీస్!


ఈ ఉచిత మెట్రో ఆఫర్ పక్కనపెడితే.. క్రీడా పరంగా టీమిండియాకు ఇదొక అగ్నిపరీక్ష. సౌతాఫ్రికా చేతిలో ఘోర ఓటమితో రన్ రేట్ దారుణంగా పడిపోయింది. ఈరోజు జింబాబ్వేపై కచ్చితంగా, అది కూడా భారీ తేడాతో గెలవాలి. లేదంటే  ఇంటికి రావడం ఖాయం. మధ్యాహ్నం జరిగే విండీస్ - సౌతాఫ్రికా మ్యాచ్ ఫలితంపైనా మన ఆశలు ఆధారపడి ఉన్నాయి.



తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)


1. ఈ ఉచిత మెట్రో సదుపాయం ఎవరికి వర్తిస్తుంది?

ఫిబ్రవరి 26న చెన్నైలో జరిగే ఇండియా-జింబాబ్వే మ్యాచ్ అధికారిక టికెట్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ ఆఫర్ వర్తిస్తుంది.


2. క్యూఆర్ కోడ్ స్కాన్ అవ్వకపోతే ఏం చేయాలి?

మెట్రో స్టేషన్లలో ఉండే కస్టమర్ కేర్ లేదా వాలంటీర్లను సంప్రదిస్తే వారు మాన్యువల్ గా చెక్ చేసి లోపలికి పంపుతారు.


3. ఎన్నిసార్లు ఉచితంగా ప్రయాణించవచ్చు?

మ్యాచ్ టికెట్ పై కేవలం ఒక రౌండ్ ట్రిప్ (వెళ్లడం, రావడం) మాత్రమే ఉచితం.


ఈ మోడల్ దేశమంతా రావాలి!


ఒక ఈవెంట్ జరిగితే నగరమంతా ట్రాఫిక్ తో స్థంభించిపోయే బదులు.. ఇలా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ను వాడటం అద్భుతమైన ఐడియా. మన హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరిగిన ప్రతిసారీ ట్రాఫిక్ నరకమే కనిపిస్తుంది. ఉప్పల్ స్టేడియం పక్కనే మెట్రో ఉన్నా సరే ఎవరూ ఇలాంటి ప్లాన్ చేయలేదు. హైదరాబాద్ మెట్రో, హెచ్‌సీఏ (HCA) కూడా భవిష్యత్తులో ఈ చెన్నై ట్రెండ్ ను ఫాలో అయితే క్రికెట్ ఫ్యాన్స్ తో పాటు, ఆ రూట్లో వెళ్లే సామాన్య ప్రజలకు కూడా ట్రాఫిక్ కష్టాలు తప్పుతాయి!