[FEATURED_IMAGE]
కోలీవుడ్ అగ్ర హీరో అజిత్ కుమార్ నటిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ 'డేర్డెవిల్' ప్రకటనతోనే దేశవ్యాప్తంగా సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతేడాది 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రంతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన యంగ్ డైరెక్టర్ ఆధిక రవిచంద్రన్ కు అజిత్ మరోసారి భారీ ఆఫర్ ఇచ్చారు. ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్లో వస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఒకే స్క్రీన్ పై ముగ్గురు దిగ్గజ స్టార్లను చూపించి ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించేలా దర్శకుడు ప్లాన్ చేస్తున్నారు.
ఈ భారీ మల్టీస్టారర్ లో మలయాళ దిగ్గజం మోహన్ లాల్, మన విక్టరీ వెంకటేష్ పవర్ ఫుల్ పాత్రల్లో నటించబోతున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఈ చర్చలు గనక సఫలమైతే సిల్వర్ స్క్రీన్ పై ఈ ముగ్గురి కలయిక సినిమా స్థాయిని అమాంతం పెంచేయడం ఖాయం. అజిత్ సతీమణి షాలిని తన కొత్త నిర్మాణ సంస్థ 'బ్రేవ్ హార్ట్స్ ప్రొడక్షన్' బ్యానర్ పై ఈ ప్రాజెక్టును అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ నిర్ణయంతో సినిమాపై ఫ్యాన్స్ లో మరింత ఆసక్తి పెరిగింది.
సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, అభినందన్ రామానుజమ్ సినిమాటోగ్రఫీ ఈ యాక్షన్ డ్రామాకు ప్రధాన బలాలుగా నిలవనున్నాయి. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ మూవీ షూటింగ్ త్వరలోనే పట్టాలెక్కనుంది. ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ కు సంబంధించి త్వరలోనే నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుండటంతో, యావత్ సౌత్ ఇండియా ఆడియన్స్ ఈ సినిమా అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

