'కరుప్పు' లాంటి ఊరమాస్ బ్లాక్బస్టర్ తర్వాత, సూర్య నటించిన పూర్తి క్లాస్ అండ్ ఫ్యామిలీ డ్రామా 'విశ్వనాథ్ అండ్ సన్స్' బాక్సాఫీస్ వద్ద బుకింగ్స్ సునామీ సృష్టిస్తోంది. యాక్షన్ ఇమేజ్ నుంచి సడెన్గా ఫ్యామిలీ కథలోకి మారితే ఓపెనింగ్స్ వస్తాయా అని సందేహించిన ట్రేడ్ వర్గాలకు, ఈ మూవీ అడ్వాన్స్ సేల్స్ దిమ్మతిరిగే షాక్ ఇస్తున్నాయి. ప్రముఖ టికెటింగ్ ప్లాట్ఫామ్ బుక్మైషోలో రికార్డు స్థాయిలో టికెట్లు అమ్ముడవడంతో సూర్య బాక్సాఫీస్ స్టామినా మరోసారి రుజువైంది.
[FEATURED_IMAGE]సాధారణంగా ఒక యాక్షన్ కమర్షియల్ హిట్ తర్వాత వచ్చే క్లాస్ సినిమాలకు బజ్ కాస్త తక్కువగా ఉంటుంది. కానీ, సూర్య క్రేజ్ ముందు ఆ ఈక్వేషన్స్ అన్నీ తలకిందులయ్యాయి. గత 24 గంటల్లో కేవలం బుక్మైషోలోనే ఈ సినిమాకు ఏకంగా 4 లక్షలకు పైగా టికెట్లు బుక్ అవ్వడం ట్రేడ్ పండితులను ఆశ్చర్యపరుస్తోంది.
విడుదల రోజుకు సంబంధించిన ఓవరాల్ అడ్వాన్స్ సేల్స్ లెక్కలు చూసుకుంటే, ఈ సంఖ్య ఏకంగా 7 లక్షల మార్క్ను దాటేసింది. ఒక పక్కా ఫ్యామిలీ ఎమోషనల్ కథకు, మునుపటి మాస్ సినిమా 'కరుప్పు' ఓపెనింగ్స్తో సమానంగా బుకింగ్స్ జరగడం మామూలు విషయం కాదు. ప్రేక్షకులు కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, హీరో ఇమేజ్ను బట్టి క్లాస్ సినిమాలకు కూడా బ్రహ్మరథం పడతారని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నాగవంశీ నిర్మించిన ఈ ప్రాజెక్ట్ను దర్శకుడు వెంకీ అట్లూరి ఎంతో అందంగా మలిచారు. రిలీజ్కు ముందు మేకర్స్ ప్లాన్ చేసిన అగ్రెసివ్ ప్రమోషన్స్, కంటెంట్పై వారు చూపించిన నమ్మకం నేరుగా అడ్వాన్స్ బుకింగ్స్పై పాజిటివ్ ప్రభావం చూపించాయి
మాస్ మూవీతో బాక్సాఫీస్ను షేక్ చేసిన సూర్య, వెంటనే ఏమాత్రం గ్యాప్ లేకుండా క్లాస్ మూవీతో రావడం ఒక సాహసమే. అయితే ఈ అడ్వాన్స్ బుకింగ్స్ జోరు గమనిస్తే, ఫ్యామిలీ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఉన్న విపరీతమైన ఆసక్తి స్పష్టమవుతోంది. కంటెంట్కు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా, ఈ లాంగ్ వీకెండ్లో 'విశ్వనాథ్ అండ్ సన్స్' వసూళ్ల రికార్డులను తిరగరాయడం ఖాయం.

.webp)