ప్రతిష్టాత్మకమైన 72వ మిస్ వరల్డ్ పోటీలు శనివారం (మే 10) సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్లో ప్రారంభం కానున్నాయి. అయితే, భారత సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరంగా ఉండనున్నారు.
మిస్ వరల్డ్ షెడ్యూల్
ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, మే 10 నుంచి మే 31 వరకు దాదాపు 22 రోజుల పాటు ఈ అందాల పోటీలు జరగనున్నాయి. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రారంభ వేడుకను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.
సీఎం రేవంత్ రెడ్డి దూరం
భారత సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో, మిస్ వరల్డ్ పోటీల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకావడం లేదు. అంతేకాకుండా, రాష్ట్ర ప్రభుత్వం తరపున మిస్ వరల్డ్ సుందరీమణులకు చౌమహల్లా ప్యాలెస్లో ఇవ్వాలనుకున్న విందు కూడా రద్దు చేయబడింది.
హైదరాబాద్లో తొలిసారి మిస్ వరల్డ్ పోటీలు
హైదరాబాద్ మహానగరం తొలిసారిగా మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇస్తోంది. దాదాపు 120 దేశాలకు చెందిన సుందరీమణులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఇప్పటివరకు 111 మంది నగరానికి చేరుకున్నారు. వారికి తెలంగాణ సంప్రదాయాలతో ఎయిర్పోర్టులో ఘన స్వాగతం లభించింది.
గ్రాండ్ ఫినాలే, తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
జూన్ 1వ తేదీన హైటెక్స్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. మొదటి 3, 4 స్థానాల్లో నిలిచిన సుందరీమణులు జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో పాల్గొంటారు. మిస్ వరల్డ్ 71వ ఎడిషన్ (2024) ఫైనల్ పోటీలు ముంబైలో జరిగాయి. వరుసగా రెండోసారి ఈ పోటీలు భారతదేశంలోనే జరుగుతుండటం విశేషం.
0 కామెంట్లు