వింత ఆచారం: 150 ఏళ్లుగా హనుమాన్ ఆలయంలో ముస్లిం పూజారులు!


మీరు ఎక్కడైనా ముస్లీంలు పూజారులుగా ఉన్న హిందూ ఆలయాన్ని చూశారా? హిందూ ఆలయాలలో ముస్లిం పూజారులా అని ఆశ్చర్యపోతున్నారా? కానీ ఇది నిజం. కర్ణాటకలోని గడగ్ జిల్లా కొరికొప్ప గ్రామంలోని లక్ష్మేశ్వర హనుమంతుడి ఆలయంలో ముస్లింలు పూజారులుగా ఉన్నారు. గత 150 సంవత్సరాలకు పైగా ఇక్కడి హనుమాన్ ఆలయంలో ముస్లిం కుటుంబాలు మాత్రమే పూజారులుగా కొనసాగుతూ వస్తున్నాయి.

కలరా నుండి కాపాడినందుకు ప్రత్యేక హక్కు

గడగ్ జిల్లాలోని లక్ష్మేశ్వర్ సమీపంలోని కొరికొప్ప హనుమాన్ ఆలయంలో గత 150 సంవత్సరాలుగా ముస్లింలే పూజారులుగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఇది హిందూ సోదరులు వారికి ఇచ్చిన ప్రత్యేక హక్కుగా చెబుతారు. ఒకప్పుడు కలరా వ్యాధి వచ్చినప్పుడు గ్రామస్తులంతా వెళ్లిపోయారట. ముస్లిం కుటుంబాలు మాత్రం అక్కడే ఉండి హనుమంతుడిని పూజించాయట. ఆ తర్వాత వ్యాధి తగ్గడంతో ముస్లింలు ఆలయ పూజ బాధ్యతలు చేపట్టారట. ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోందని స్థానికులు అంటున్నారు.

మత సామరస్యానికి ప్రతీక

కోరికొప్ప గ్రామ పెద్దలు సోదరభావం మరియు మత సామరస్యాన్ని పెంపొందించడానికి ఆనాటి నుండి ముస్లింలు పూజలు మరియు ఇతర ఆచారాలను నిర్వహించడానికి అనుమతించారని చెబుతారు. కోరికొప్పలో హిందువులు మరియు ముస్లింలు ఎల్లప్పుడూ శాంతియుతంగా అన్నదమ్ముల వలె కలిసి జీవిస్తుంటారని, ఈ గ్రామంలో ఎప్పుడూ ఎలాంటి మత ఘర్షణలకు తావు ఉండదని గ్రామస్తులు చెబుతున్నారు. అంతేకాదు, ప్రత్యేక రోజులు మరియు పండుగల సమయాల్లో కుల మరియు మత భేదాలు లేకుండా గ్రామస్తులంతా కలిసి ఆలయంలో పూజాది కార్యక్రమాలకు హాజరవుతారని వారు తెలిపారు.