"శాశ్వత అధికారం": చంద్రబాబు వ్యాఖ్యలపై దుమారం

naveen
By -
0

 "పార్టీని శాశ్వతంగా అధికారంలో ఉంచుతాం!".. చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలే ఇప్పుడు సంచలనంగా మారాయి. సృష్టి ధర్మానికి విరుద్ధమైన ఈ మాటలపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది.


"శాశ్వత అధికారమే లక్ష్యం": చంద్రబాబు


ఏ వస్తువుకైనా, ఎంతటి రుచికరమైన పదార్థానికైనా 'ఎక్స్ పైరీ డేట్' ఉంటుంది. చివరికి మనిషికి కూడా మరణం (Expiry Date) తప్పదు. అలాంటిది, రాజకీయ అధికారాన్ని శాశ్వతంగా ఉంచాలనుకోవడం అత్యాశే అవుతుంది. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నోటి నుంచి ఇదే తరహాలో వచ్చిన వ్యాఖ్య విన్నవారినే కాదు, ఆయన మద్దతుదారులను కూడా ఆశ్చర్యపరిచింది.


"శాశ్వత అధికారమే లక్ష్యం": చంద్రబాబు

అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గ పరిధిలోని దేవగుడిపల్లిలో జరిగిన టీడీపీ సమావేశంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. "పార్టీని శాశ్వతంగా అధికారంలో ఉంచాలనే లక్ష్యంతో ప్రణాళిక రూపొందించాం. అందులో భాగంగా నెలవారీగా నియోజకవర్గాలపై అభిప్రాయ సేకరణ చేపడతాం" అని ఆయన అన్నారు. ఈ మాటలు వినేందుకు బాగానే ఉన్నా, ఆచరణ సాధ్యమేనా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.


గుజరాత్ మోడల్.. ఏపీలో సాధ్యమా?

అధికారంలో ఉన్న రోజుల్లో ఎదురైన చేదు అనుభవాల్ని చంద్రబాబు తేలిగ్గా మరచిపోతారని, చర్యల విషయంలో ఆయన ఎప్పుడూ కఠినంగా వ్యవహరించరన్న పేరుంది. అలాంటిది, ఈ "శాశ్వత ప్రణాళిక" ఎలా ఆచరణలో పెడతారని కొందరు సందేహిస్తున్నారు.

అయితే, తన వాదనను సమర్థించుకుంటూ చంద్రబాబు గుజరాత్‌ను ఉదహరించారు. "గుజరాత్‌లో పాతికేళ్ల నుంచి ఒకే పార్టీ అధికారంలో ఉండటంతో అక్కడ డెవలప్‌మెంట్ శరవేగంగా సాగుతోంది. అదే తరహా ఏపీలో జరగాలి. పార్టీ ఇకపై ఓడిపోవటం అన్నది ఉండదు" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


మాటలకు, చేతలకు పొంతన లేదంటున్న 'తమ్ముళ్లు'?

"మన విజయానికి ఎన్నో వ్యూహాలు ఉన్నాయి. జెండా మోసిన వారి త్యాగాలు గుర్తుకొస్తున్నాయి. వారి అభిప్రాయానికే విలువ ఇచ్చి పదవులు ఇచ్చాం. చాలాచోట్ల పార్టీ శ్రేణులు తిరస్కరించటంతో పలువురిని పదవుల నుంచి పక్కన పెట్టాం" అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

కానీ, కార్యకర్తలకు పదవులు ఇచ్చినట్లు చెబుతున్నప్పటికీ, వాస్తవంలో అలాంటి పరిస్థితి లేదన్న మాట "తెలుగు తమ్ముళ్ల" నుంచే వినిపిస్తోంది. చంద్రబాబు చెప్పే మాటలకు, చేసే పనులకు సంబంధం ఉండటం లేదన్న విమర్శలు సొంత పార్టీ నుంచే వస్తున్నాయి.


"ఫోకస్ అమరావతిపై పెట్టండి"

ఈ తరహా ప్లానింగ్‌కు బదులుగా, ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం మీద దృష్టి పెట్టవచ్చు కదా? అని కొందరు హితవు పలుకుతున్నారు. ప్రభుత్వానికి ఏదైతే మైలేజీ తెచ్చి పెడుతుందో, ఆయా అంశాల మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.


ఇవన్నీ వదిలేసి, పార్టీని శాశ్వతంగా పవర్‌లో ఉంచుతామన్న మాట "అత్యాశ"గా ధ్వనిస్తోందని మర్చిపోకూడదు. పదవులు, పవర్ అన్నది ఏ అధినేత చేతుల్లో ఉండదు. అది కేవలం ఓటర్లు మాత్రమే డిసైడ్ చేస్తారు. అందుకే ఈ తరహా అంశాలపై మాట్లాడేటప్పుడు, మాటల్లో కాస్త పొదుపు పాటిస్తే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!