"రాకెట్ పట్టుకోని వాళ్లు కూడా.." సానియా మీర్జా స్ట్రాంగ్ కౌంటర్!

naveen
By -

 రాకెట్ పట్టుకోవడం రానివాళ్లు కూడా విమర్శలు చేస్తారు.. వాళ్లను చూస్తే జాలేస్తుందన్న సానియా మీర్జా! యువ క్రికెటర్‌కు ఆమె ఇచ్చిన ఆ సలహా ఇప్పుడు వైరల్ అవుతోంది.


Sania Mirza speaking at Bengaluru Tech Summit 2025 with Richa Ghosh.


బెంగళూరు టెక్‌ సమ్మిట్‌ 2025 వేదికగా ఆరుసార్లు గ్రాండ్‌ స్లామ్‌ ఛాంపియన్‌ సానియా మీర్జా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత మహిళల క్రికెట్‌ జట్టు యువ సంచలనం రిచా ఘోష్‌తో ముచ్చటిస్తూ, సోషల్ మీడియా ట్రోల్స్‌ను ఎలా డీల్ చేయాలో తనదైన శైలిలో వివరించారు. సోషల్‌ మీడియాను అస్సలు పట్టించుకోవద్దని, దాని ప్రభావం మన మానసిక స్థితిపై పడకుండా చూసుకోవాలని గట్టిగా సూచించారు.


"వాళ్లను చూస్తే జాలేస్తుంది"

గతంలో తనపై వచ్చిన విమర్శలను గుర్తుచేసుకుంటూ సానియా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు:

  • రాకెట్ పట్టని వారే విమర్శిస్తారు: జీవితంలో ఒక్కసారి కూడా టెన్నిస్‌ రాకెట్‌ను చేత్తో తాకని వారు కూడా క్రీడాకారుల ఆటతీరు గురించి మాట్లాడడం చూస్తే తనకు నవ్వు, జాలి కలుగుతాయని అన్నారు.

  • డిన్నర్ చేస్తే ఓడిపోతారా?: ఆటగాళ్లు మ్యాచ్‌కు ముందు రోజు డిన్నర్‌కు వెళ్తే, దానివల్లే మ్యాచ్‌ ఓడిపోయారంటూ లేనిపోని కథనాలు అల్లుతారని, ఇవన్నీ హాస్యాస్పదంగా ఉంటాయని ఎద్దేవా చేశారు.

  • అసంతృప్తులే బురద చల్లుతారు: జీవితంలో ఆనందంగా లేనివారే, దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారిపై బురద చల్లే ప్రయత్నం చేస్తారని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.


వ్యక్తిగత జీవితంపైనే ఫోకస్

రిచా ఘోష్‌ ఇప్పుడు ఎలక్ట్రానిక్‌, సోషల్‌ మీడియా యుగంలో ఉన్నారని, కానీ తన రోజుల్లో వార్తా పత్రికలే ఉండేవని సానియా గుర్తుచేసుకున్నారు. అప్పటి నుంచే మీడియా ఫోకస్ ఆట కంటే వ్యక్తిగత జీవితాల మీదకు మళ్లిందని అభిప్రాయపడ్డారు. మంచిరాని, చెడురాని.. ఏదీ మనసులోకి తీసుకోకుండా ముందుకు సాగడమే విజేత లక్షణమని సానియా మీర్జా హితవు పలికారు.


Tags: