Iran Warns IT Giants: గూగుల్, మైక్రోసాఫ్ట్‌లకు ఇరాన్ వార్నింగ్.. గల్ఫ్ యుద్ధంతో మన ఐటీ ఉద్యోగులకు ముప్పేంటి?

naveen
By -

ఎక్కడో పశ్చిమాసియాలో బాంబులు పడుతుంటే మన వరంగల్, హైదరాబాద్‌లలో ఉండే సామాన్యుడికి, ఐటీ ఉద్యోగికి ఏం సంబంధం అని లైట్ తీసుకుంటున్నారా? అయితే మీరు ఏమాత్రం ఊహించని భయంకరమైన నిజం ఒకటి బయటపడింది. ఇరాన్ ఇప్పుడు కేవలం మిలిటరీ బేస్‌ల మీద మాత్రమే కాదు.. మనం రోజూ వాడే, మన సాఫ్ట్‌వేర్ కుర్రాళ్లు లక్షల్లో పనిచేసే గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం లాంటి గ్లోబల్ ఐటీ కంపెనీల మీద దాడులు చేస్తామని బాంబు పేల్చింది. దుబాయ్ ఎయిర్ పోర్ట్ సమీపంలో డ్రోన్ దాడులు, ఇజ్రాయెల్ పై క్లస్టర్ బాంబులతో విరుచుకుపడుతున్న ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ.. ఇప్పుడు టెక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? దీనివల్ల మన ఉద్యోగాలకు, ఇంటర్నెట్ డేటాకు పొంచి ఉన్న ముప్పేంటో క్లియర్ గా తెలుసుకుందాం.


Iran Warns IT Giants


గూగుల్, మైక్రోసాఫ్ట్‌లే ఇరాన్ కొత్త టార్గెట్!


అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతికారం తీర్చుకునే క్రమంలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) ఒక సంచలన జాబితాను విడుదల చేసింది. ఇజ్రాయెల్ కు సాంకేతిక పరిజ్ఞానం అందిస్తున్నాయని ఆరోపిస్తూ గ్లోబల్ ఐటీ సంస్థలను లక్ష్యంగా చేసుకుంది.


గూగుల్ (Google), మైక్రోసాఫ్ట్ (Microsoft), ఐబీఎం (IBM), ఒరాకిల్ (Oracle), ఎన్విడియా (Nvidia), పలాంటిర్ వంటి దిగ్గజ సంస్థల కార్యాలయాలు, క్లౌడ్ సర్వర్లే తమ కొత్త టార్గెట్ అని ఇరాన్ అనుబంధ మీడియా 'తస్నిమ్' ప్రకటించింది.


ఇజ్రాయెల్ తో పాటు గల్ఫ్ దేశాల్లో ఉన్న ఈ ఐటీ కంపెనీల మౌలిక సదుపాయాలపై దాడులు చేయడం చట్టబద్ధమేనని ఇరాన్ సమర్థించుకుంటోంది. ఈ ప్రాంతీయ సంఘర్షణ ఇప్పుడు 'మౌలిక సదుపాయాల యుద్ధం' (Infrastructure War) గా మారుతోంది.


దుబాయ్ ఎయిర్‌పోర్ట్ వద్ద టెన్షన్.. క్లస్టర్ బాంబుల ప్రయోగం


ఇరాన్ దాడులు కేవలం మాటలకే పరిమితం కాలేదు. మన భారతీయులు ఎక్కువగా ప్రయాణించే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో తాజాగా డ్రోన్ దాడి జరగడం తీవ్ర కలకలం రేపుతోంది.


మరోవైపు ఇజ్రాయెల్ పైకి ఇరాన్ 'క్లస్టర్ బాంబుల'ను (Cluster Bombs) ప్రయోగిస్తోంది. ఇవి గాల్లోనే పేలిపోయి కిలోమీటర్ల మేర చెల్లాచెదురుగా పడిపోతుండటంతో.. ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ (Iron Dome) కూడా వీటిని అడ్డుకోలేక సతమతమవుతోంది.


ట్రంప్ ప్లాన్ ఫ్లాప్.. రంగంలోకి మొజ్తబా ఖమేనీ


యుద్ధాన్ని త్వరలోనే ముగిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన మాటలు ప్రస్తుత పరిణామాలతో ఒట్టి మాటలేనని తేలిపోయింది. యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది.


ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఆయతుల్లా అలీ ఖమేనీ కుమారుడు 'మొజ్తబా ఖమేనీ' ఎంపికవ్వడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఆయన అత్యంత కఠినమైన వైఖరితో దాడులను ముమ్మరం చేస్తుండటం పట్ల ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


ఇరాన్ వార్నింగ్ ఇచ్చినట్లు గల్ఫ్ దేశాల్లోని గూగుల్, మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వర్లపై దాడులు జరిగితే.. గ్లోబల్ ఇంటర్నెట్ సేవలు, బ్యాంకింగ్ సిస్టమ్స్ తీవ్రంగా దెబ్బతింటాయి. దీని ప్రభావం డైరెక్ట్ గా హైదరాబాద్, బెంగళూరులో ఆయా ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న మన ఐటీ ఉద్యోగుల (Job Security) మీద పడుతుంది. యుద్ధం ఏ క్షణాన టెక్ వార్‌గా మారుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.