రణక్షేత్రంలో రక్తం పారకముందే... స్టాక్ మార్కెట్లో కాసుల వర్షం కురిపించే భారీ స్కెచ్! అమెరికా రక్షణ మంత్రి (పెంటగాన్ చీఫ్) పీట్ హెగ్సెత్ (Pete Hegseth) చుట్టూ ఇప్పుడు అత్యంత సంచలనమైన, గగుర్పాటుకు గురిచేసే ఆరోపణలు ఉచ్చు బిగిస్తున్నాయి. ప్రపంచమంతా యుద్ధ భయంతో వణికిపోతుంటే, తెరవెనుక జరిగిన ఒక భారీ పెట్టుబడుల వ్యవహారం ఇప్పుడు అమెరికా రాజకీయాలను కుదిపేస్తోంది.
బాంబులు పడకముందే.. కోట్లు పెట్టుబడి!
అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై భీకర దాడులు చేయడానికి సరిగ్గా కొద్ది రోజుల ముందు జరిగిన ఈ తతంగం ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. ఫైనాన్షియల్ టైమ్స్ (Financial Times) తాజా నివేదిక ప్రకారం, పీట్ హెగ్సెత్ కోసం పనిచేసే ఒక బ్రోకర్.. రక్షణ రంగానికి (defence-linked assets) సంబంధించిన ఆస్తుల్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు పావులు కదిపాడు.
బ్లాక్రాక్ టార్గెట్గా బ్రోకర్ స్కెచ్
మోర్గాన్ స్టాన్లీ (Morgan Stanley) సంస్థతో అనుబంధం ఉన్న ఈ బ్రోకర్, ఫిబ్రవరి నెలలో ఏకంగా బ్లాక్రాక్ (BlackRock) సంస్థను సంప్రదించాడు. రక్షణ రంగానికి సంబంధించిన ఒక ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్లో (ETF) కొన్ని మిలియన్ డాలర్ల (కోట్ల రూపాయల) భారీ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టాలని ప్లాన్ చేశాడు. టెహ్రాన్పై అమెరికా దాడులు ప్రారంభించడానికి సరిగ్గా కొన్ని వారాల ముందే ఈ పరిణామం చోటుచేసుకోవడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది.
ప్లాన్ ఫెయిల్.. అసలు నిజం ఎవరికి తెలుసు?
అయితే, ఈ భారీ పెట్టుబడి ప్లాన్ చివరి నిమిషంలో ఆగిపోయింది. గతేడాది ప్రవేశపెట్టిన ఆ బ్లాక్రాక్ ఫండ్, అప్పటికింకా మోర్గాన్ స్టాన్లీ ప్లాట్ఫామ్లో కొనుగోలుకు అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణం. అయితే, ఈ వ్యవహారంలో బ్రోకర్ సొంతంగా నిర్ణయం తీసుకున్నాడా? లేక రక్షణ మంత్రి హెగ్సెత్కు ఈ విషయం ముందే తెలుసా? అన్నది ఆ నివేదిక స్పష్టం చేయలేదు. ఈ ఉదంతంపై వ్యాఖ్యానించేందుకు బ్లాక్రాక్ సంస్థ నిరాకరించగా.. మోర్గాన్ స్టాన్లీ, అమెరికా రక్షణ శాఖ (Department of Defense) ఇప్పటివరకు ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదు.
ట్రంప్ నిర్ణయాల వెనుక ఇన్సైడర్ ట్రేడింగ్?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే అత్యంత కీలకమైన విధాన నిర్ణయాలకు ముందు.. ఫైనాన్షియల్, ప్రిడిక్షన్ మార్కెట్లలో జరుగుతున్న అనుమానాస్పద ట్రేడింగ్ కార్యకలాపాలపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిఘా పెరిగిన వేళ ఈ వార్త బట్టబయలు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇరాన్పై దాడికి హెగ్సెత్దే తొలి అడుగు!
గత వారం మిలిటరీ, చట్ట అమలు అధికారులతో జరిగిన ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చుతున్నాయి. తన క్యాబినెట్లో ఇరాన్పై సైనిక దాడికి తొలిసారిగా గొంతెత్తింది హెగ్సెత్ మాత్రమేనని ట్రంప్ స్వయంగా వెల్లడించారు. ఇజ్రాయెల్ దాడుల్లో అమెరికా భాగస్వామ్యం కావడానికి దారితీసిన అంతర్గత చర్చలను వివరిస్తూ, ఇరాన్ను ఒక శాశ్వత ముప్పుగా ట్రంప్ అభివర్ణించారు.
తీవ్రవాద దేశం.. మిడిల్ ఈస్ట్కు చిన్న ప్రయాణం!
"గత 47 ఏళ్లుగా ఇరాన్ కేవలం తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశం... వారు అణ్వాయుధాన్ని తయారు చేసేందుకు చాలా దగ్గరలో ఉన్నారు" అని ట్రంప్ ఆ సమావేశంలో హెచ్చరించారు. ఆ సమయంలో తమ ముందున్న ప్రత్యామ్నాయాలను వివరిస్తూ.. "మనం ఇలాగే చూస్తూ ఊరుకోవచ్చు... లేదా ఒక్క క్షణం ఆగి, మిడిల్ ఈస్ట్కు ఒక చిన్న ప్రయాణం చేసి, ఈ అతిపెద్ద సమస్యను సమూలంగా నాశనం చేయవచ్చు" అని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అణ్వాయుధం వారి చేతికి దక్కకూడదు!
ఆ కీలక నిర్ణయంలో హెగ్సెత్ పాత్రను ట్రంప్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. "పీట్.. ఇరాన్పై దాడి చేద్దామని మొదటిసారి గొంతెత్తింది నువ్వేనని నేను అనుకుంటున్నాను. అణ్వాయుధం వారి చేతికి దక్కకూడదు.. దాడి చేద్దాం అని నువ్వే చెప్పావు" అంటూ ట్రంప్ గుర్తుచేశారు.
యుద్ధమా? వ్యాపారమా?
ఈ వ్యాఖ్యలతో ఇరాన్పై యుద్ధానికి తొలి బీజం వేసింది రక్షణ మంత్రేనని స్పష్టమవుతోంది. అయితే, ఇరాన్ నుంచి తక్షణ అణు ముప్పు పొంచి ఉందని ఒకసారి, ఇజ్రాయెల్ తీసుకున్న చర్యల వల్ల ఈ యుద్ధంలో తాము పాల్గొనక తప్పలేదని మరోసారి.. అమెరికా యంత్రాంగం భిన్నమైన వివరణలు ఇస్తూనే ఉంది. ఏది ఏమైనా, దేశ భద్రత పేరుతో సాగుతున్న ఈ రక్తపాతంలో తెరవెనుక కాసుల కక్కుర్తి దాగి ఉందన్న ఆరోపణలు మాత్రం ఇప్పుడు అమెరికా రాజకీయాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి!
Also Read:
ఆర్థిక దిగ్బంధనం.. అమాయకుల ప్రాణాలతో చెలగాటం! ఎందుకీ దాడులు?ఇరాన్ మాస్టర్ స్కెచ్: అమెరికాతో యుద్ధం సాగదీత వెనుక 5 నిజాలు!
H-1B లాటరీ రాలేదా? టెన్షన్ వద్దు.. అమెరికా వెళ్లే 4 మార్గాలివే!
హార్మూజ్ మూసుకున్నా డోంట్ కేర్: ఇరాన్తో ట్రంప్ సరికొత్త వ్యూహం
దుబాయ్ ఆకాశంలో డ్రోన్ దాడులు: నలుగురికి గాయాలు!

