Minuteman 3 ICBM Test: ఇరాన్ గుండెల్లో రైళ్లు.. భూగోళాన్ని నాశనం చేసే అణు క్షిపణిని పరీక్షించిన అమెరికా

naveen
By -

ఎక్కడో పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం చేసుకుంటుంటే.. అమెరికా సడెన్‌గా తన సొంత గడ్డపై ఒక 'ఖండాంతర అణు క్షిపణి'ని ఎందుకు ప్రయోగించింది? హిరోషిమాపై వేసిన బాంబు కంటే 20 రెట్లు పవర్ ఫుల్ అయిన ఈ 'మినిట్‌మ్యాన్-3' క్షిపణి దెబ్బకు ఇప్పుడు భూగోళం మొత్తం ఎందుకు వణికిపోతోంది? "ఇది పాత షెడ్యూలే, ఇరాన్ యుద్ధానికి దీనికి సంబంధం లేదు" అని అమెరికా కవరింగ్ ఇస్తున్నా.. అసలు తెరవెనుక జరుగుతున్న అణు యుద్ధ కుట్ర ఏంటి? రెండు అగ్రరాజ్యాల ఇగోల వల్ల రాబోయే ఈ న్యూక్లియర్ ముప్పు మన సామాన్యుడి ప్రాణాలకు, జేబుకు ఎలా ఎసరు పెట్టబోతోందో కచ్చితంగా తెలుసుకోండి.


Minuteman 3 ICBM Test


కాలిఫోర్నియా టు మార్షల్ దీవులు.. భయపెట్టిన మిస్సైల్


ఇరాన్ దాడులతో గల్ఫ్ అట్టుడుకుతున్న వేళ.. అమెరికా తన కాలిఫోర్నియా తీరంలోని వాండెన్‌బర్గ్‌ స్పేస్‌ ఫోర్స్‌ స్థావరం నుంచి 'మినిట్‌మ్యాన్‌-3' (Minuteman-III) అనే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని (ICBM) మార్చి 3న విజయవంతంగా పరీక్షించింది.


అమెరికా వైమానిక దళం ప్రయోగించిన ఈ క్షిపణి.. వేల మైళ్ల దూరం ప్రయాణించి పసిఫిక్ మహాసముద్రంలోని మార్షల్ దీవుల్లో (క్వాజలీన్ అటోల్) తాను అనుకున్న లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించి ప్రపంచ దేశాలకు వణుకు పుట్టించింది.


గంటకు 15 వేల మైళ్ల వేగం.. ప్రపంచంలో ఎక్కడికైనా!


ఈ మినిట్‌మ్యాన్‌-3 క్షిపణి ఎంత ప్రమాదకరమైనదంటే.. ఇది గంటకు ఏకంగా 15 వేల మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీని రేంజ్ 13 వేల కిలోమీటర్లు. అంటే భూగోళం మీద ఏ మూలన ఉన్న దేశమైనా సరే.. అమెరికా బటన్ నొక్కిన కొన్ని నిమిషాల్లోనే బూడిదైపోతుంది.


ఇందులో అత్యంత శక్తిమంతమైన మార్క్‌-21 (Mark-21) అనే రీఎంట్రీ వాహనం ఉంటుంది. దీని ద్వారా అణు బాంబులను మోసుకెళ్లవచ్చు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌లోని హిరోషిమాను నాశనం చేసిన బాంబు కంటే.. ఇది 20 రెట్లు ఎక్కువ పవర్ ఫుల్ వార్‌హెడ్‌లను మోసుకెళ్లగలదు. అమెరికా దగ్గర ఉన్న ఏకైక సైలో-ఆధారిత భూతల అణు క్షిపణి ఇదే కావడం గమనార్హం.


ఇరాన్‌కు ఇది అమెరికా మైండ్ గేమేనా?


అయితే, ఈ ప్రయోగంపై అమెరికా స్పేస్ ఫోర్స్ ఒక క్లారిటీ ఇచ్చింది. ఆయుధ వ్యవస్థ విశ్వసనీయతను, కచ్చితత్వాన్ని పరీక్షించడానికి దశాబ్దాలుగా చేస్తున్న డేటా ఆధారిత ప్రయోగాల్లో ఇది ఒకటని, కొన్నేళ్ల కిందటే దీన్ని షెడ్యూల్ చేశామని చెప్పుకొచ్చింది.


ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలతో దీనికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. కానీ, ఇరాన్ డ్రోన్లు అమెరికా రాడార్లను పేల్చేస్తున్న కరెక్ట్ టైమ్‌లోనే.. అమెరికా ఈ అణు క్షిపణిని ప్రయోగించడం వెనుక కచ్చితంగా ఇరాన్‌ను మానసికంగా భయపెట్టే (Mind Game) కుట్ర దాగి ఉందని మిలిటరీ నిపుణులు విశ్లేషిస్తున్నారు.


యుద్ధం జరుగుతున్న టైమ్‌లో ఇలాంటి అణు క్షిపణులను టెస్ట్ చేయడం అంటే.. "మా దగ్గర ఇంత పవర్ ఫుల్ ఆయుధాలున్నాయి, సైలెంట్ గా ఉండండి" అని శత్రు దేశాలకు పరోక్షంగా వార్నింగ్ ఇవ్వడమే. ఇది కేవలం పాలిటిక్స్‌కే పరిమితమైతే పర్వాలేదు, కానీ అణు దాడుల భయం గ్లోబల్ స్టాక్ మార్కెట్లను కుప్పకూల్చుతుంది. ఇంధన ధరలను అమాంతం పెంచేస్తుంది.