పశ్చిమాసియా రణరంగంలో యాక్షన్ థ్రిల్లర్ను మించిన ఉత్కంఠ! క్షిపణుల మోతతో సముద్ర జలాలు అగ్నిగుండంగా మారుతున్నాయి. ప్రపంచ చమురు రాకపోకలకు గుండెకాయ లాంటి హార్మూజ్ జలసంధికి ఇరాన్ లాక్ వేయడంతో ఇంటర్నేషనల్ మార్కెట్ షేక్ అవుతోంది. ఆయిల్ ట్యాంకర్లు ఎక్కడికక్కడ ఆగిపోయి ప్రపంచ దేశాలు వణుకుతున్న వేళ.. మన ఇండియాకు మాత్రం ఇరాన్ నుంచి ఒక అదిరిపోయే తీపి కబురు అందింది!
మా దోస్తులు పక్కా సేఫ్.. ఇరాన్ మాస్ అనౌన్స్మెంట్!
యుద్ధ వాతావరణంతో అల్లాడిపోతున్న భారత్కు ఇరాన్ గురువారం నాడు భారీ ఊరటనిచ్చింది. "మా భారతీయ మిత్రులు టెన్షన్ పడాల్సిన పనేలేదు.. వారు పక్కా సురక్షితంగా ఉన్నారు" అని భారత్లోని ఇరాన్ ఎంబసీ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఒక గ్రాండ్ అనౌన్స్మెంట్ ఇచ్చింది.
Our Indian friends are in safe hands, no worries 😉 https://t.co/5NqoSFlDPQ
— Iran in India (@Iran_in_India) April 1, 2026
మన నౌకలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఇరాన్, అదే సమయంలో మిగతా దేశాలకు మాత్రం చుక్కలు చూపిస్తోంది. హార్మూజ్ జలసంధి నుంచి వెళ్లే ఏ ఆయిల్ ట్యాంకర్ నౌక అయినా సరే.. టోల్ ఫీజు కింద ఏకంగా 2 మిలియన్ డాలర్లు కట్టాల్సిందేనని ఇరాన్ బాంబు పేల్చింది.
ఫిబ్రవరి 28.. ఇక్కడే మొదలైంది !
ఫిబ్రవరి 28.. ఈ తేదీతోనే పశ్చిమాసియాలో అసలు నెత్తుటి ఆట మొదలైంది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' పేరుతో చేసిన విధ్వంసకర దాడులతో ఇరాన్ గడ్డ దద్దరిల్లింది.
ఫస్ట్ డేనే సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీతో సహా టాప్ లీడర్లు కన్నుమూశారు. దీంతో ప్రతీకారంతో రగిలిపోయిన ఇరాన్.. ఏకంగా గల్ఫ్లోని అమెరికా బేస్లపై, వాళ్ల మిత్రదేశాల ఇంధన మౌలిక సదుపాయాలపై శివతాండవం చేసింది.
ప్రపంచానికే 25 శాతం చమురును పంపే కీలకమైన హార్మూజ్ జలసంధి గేట్లను దాదాపుగా మూసేసింది. ఇంకేముంది.. ఆయిల్, గ్యాస్ ట్యాంకర్ల రవాణా స్తంభించిపోయి భారత్ సహా ఎన్నో దేశాలకు ఇంధన సరఫరా ఎక్కడికక్కడ కట్ అయింది. యుద్ధం మొదలైన తర్వాత అతి కొద్ది నౌకలు మాత్రమే ఆ డేంజర్ జోన్ను దాటగలిగాయి.
రెడ్ కార్పెట్ ఎవరికంటే.. చిక్కుకున్న నౌకల ఉత్కంఠ!
యాక్షన్ సీక్వెన్స్ మధ్యలో ప్రాణ స్నేహానికి పెద్ద పీట వేసింది ఇరాన్. భారత్, చైనా, రష్యా, ఇరాక్, పాకిస్థాన్ లాంటి తమ ప్రాణమిత్రుల నౌకలకు మాత్రమే ప్రయాణ అనుమతులు ఇస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇప్పటిదాకా కనీసం 8 భారతీయ నౌకలు ఈ హార్మూజ్ అగ్నిగుండాన్ని దాటి సేఫ్గా బయటపడ్డాయి. అందులో 94 వేల టన్నుల భారీ కెపాసిటీ ఉన్న 'బీడబ్ల్యూ టైర్', 'బీడబ్ల్యూ ఈఎల్మ్' (BW TYR, BW ELM) అనే రెండు దిగ్గజ ఎల్పీజీ ట్యాంకర్లు కూడా ఉండటం విశేషం.
అయితే ఇక్కడే ఒక మెలిక ఉంది. హార్మూజ్లో మన దేశానికి చెందిన మరో 19 వరకు ఎల్పీజీ, క్రూడాయిల్ ట్యాంకర్లు ఇంకా చిక్కుకుని ఉండటంతో ఉత్కంఠ కొనసాగుతోంది.
విదేశీ నౌకలకు బ్రేక్.. హై-లెవల్ మీటింగ్ అప్డేట్!
ఈ సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. మార్చి 30న పశ్చిమాసియా పరిణామాలపై జరిగిన హై-లెవల్ మీటింగ్లో పోర్ట్స్ అండ్ షిప్పింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా కీలక విషయాలు బయటపెట్టారు.
ఇండియాకు ఇంధనం తీసుకొస్తున్న 10 విదేశీ జెండా నౌకలు కూడా ప్రస్తుతం బ్రేకులు వేసుకుని నిలిచిపోయాయని ఆయన తెలిపారు. వీటిలో ఎల్పీజీతో ఉన్న 3 నౌకలు, 4 ముడి చమురు ట్యాంకర్లు, మరో 3 సహజ వాయువు రవాణా నౌకలు ఉన్నాయని వెల్లడించారు.
మందుపాతరలు, క్షిపణుల మధ్య సాగుతున్న ఈ నెత్తుటి చమురు ఆటలో.. చిక్కుకున్న భారత నౌకలన్నీ క్షేమంగా తీరం చేరేవరకు ఈ సస్పెన్స్ థ్రిల్లర్కు ఎండ్ కార్డ్ పడే ఛాన్సే లేదు!
Also Read:
అమెరికా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ సక్సెస్: ట్రంప్ సంచలన ప్రసంగం!హార్మూజ్ జలసంధికి లింక్: ట్రంప్ vs ఇరాన్ వార్!
ఇరాన్ పాలకులపై సైన్యం తిరుగుబాటు.. గుప్పిట్లో అధ్యక్షుడు!
ఇరాన్ యుద్ధం మాకొద్దు: డొనాల్డ్ ట్రంప్కు బ్రిటన్ ప్రధాని షాక్!
ఖర్గ్ దీవిపై ట్రంప్ కన్ను.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న అమెరికా!

