పై ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు ఆమె టాలీవుడ్ లో చాలా ఫేమస్. హీరోయిన్గా నటించకపోయినా తన అందం, అభినయంతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఎక్కువగా స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లకు అక్కగా, చెల్లిగా నటిస్తూ ఈ ముద్దుగుమ్మ తనదైన శైలిలో మెప్పిస్తోంది. ఇప్పటివరకు దాదాపు 25కి పైగా సినిమాల్లో నటించిన ఈ నటి సొంతూరు తెలంగాణలోని నిజామాబాద్.
యాంకర్గా కెరీర్ ప్రారంభం.. ఫిదాతో గుర్తింపు
బీఎస్సీ పూర్తి చేసిన తర్వాత శరణ్య మొదట తన స్వస్థలమైన నిజామాబాద్లోని ఒక లోకల్ న్యూస్ ఛానెల్లో యాంకర్గా తన కెరీర్ను ప్రారంభించింది. ఆ తర్వాత హైదరాబాద్కు వచ్చి ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్లో యాంకర్గా విధులు నిర్వర్తించింది. అక్కడ పనిచేస్తున్న సమయంలోనే ఆమెకు సినిమా వాళ్లతో పరిచయాలు ఏర్పడ్డాయి. సినిమా ఆడిషన్స్కు వెళ్లగా, శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘ఫిదా’ సినిమాలో అవకాశం దక్కింది. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాలో సాయి పల్లవికి అక్కగా శరణ్య అద్భుతంగా నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. తన నటనా ప్రతిభకు ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ ఫేర్ పురస్కారానికి కూడా నామినేట్ అయింది.
టాలీవుడ్లో బిజీ ఆర్టిస్ట్
ప్రస్తుతం శరణ్య ప్రదీప్ టాలీవుడ్లో హీరోలు, హీరోయిన్లకు అక్కగా, చెల్లిగా మరియు సహాయ నటిగా నటిస్తూ చాలా బిజీగా ఉంది. ఆమె తన సహజమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తోంది.
పుట్టినరోజు వేడుకలు, వైరల్ అవుతున్న ఫోటోలు
శనివారం (మే 17) శరణ్య ప్రదీప్ పుట్టినరోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు మరియు నెటిజన్లు ఆమెకు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అదే సమయంలో శరణ్యకు సంబంధించిన అరుదైన ఫోటోలు మరియు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’లో సాహసోపేతమైన నటన
సినిమాల విషయానికి వస్తే, శరణ్య ప్రదీప్ గత ఏడాది మొత్తం నాలుగు సినిమాల్లో నటించింది. ముఖ్యంగా సుహాస్ నటించిన ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ సినిమాలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాలో ఒక సన్నివేశంలో ఆమె వివస్త్రగా నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక చివరిసారిగా ఆమె కిరణ్ అబ్బవరం సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈ అందాల తార చేతిలో మరికొన్ని సినిమాలు కూడా ఉన్నాయి.