కర్ణాటక పాలిటిక్స్: సిద్ధూ, డీకే బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్స్.. సీఎం మార్పు?

naveen
By -

దోశలు, ఇడ్లీల సాక్షిగా కర్ణాటక రాజకీయాల్లో ఏం జరుగుతోంది? ఆ "బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్స్" వెనుక ఉన్న అసలు కథ తెలిస్తే ఆశ్చర్యపోతారు!


Siddaramaiah and DK Shivakumar breakfast diplomacy amidst power sharing row.


కర్ణాటక కాంగ్రెస్‌లో 'కుర్చీలాట' ఇప్పుడు పీక్ స్టేజ్‌కు చేరింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తవడంతో, 'పవర్ షేరింగ్' (Power Sharing) పంచాయితీ మళ్లీ మొదలైంది. ఒప్పందం ప్రకారం మిగిలిన టర్మ్ డీకే శివకుమార్‌కు (DKS) ఇవ్వాల్సిందేనని ఆయన వర్గం ఎమ్మెల్యేలు ఢిల్లీలో హైకమాండ్ దగ్గర గట్టిగానే డిమాండ్ చేశారు. దీంతో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వర్గాల మధ్య ఇప్పుడు ఒక రకమైన ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది.


టిఫిన్ రాజకీయాలు.. సీన్ రివర్స్!

ఈ రాజకీయ వేడిని తగ్గించేందుకు ఇద్దరు నేతలు ఇప్పుడు కొత్తగా 'బ్రేక్‌ఫాస్ట్ డిప్లమసీ'ని ఎంచుకున్నారు. గత శనివారం సిద్ధరామయ్య తన ఇంటికి డీకేను అల్పాహారానికి పిలిచి, బయటకు వచ్చి "మా మధ్య గొడవల్లేవు, అంతా మీడియా సృష్టే" అని కవర్ చేశారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. మంగళవారం ఉదయం డీకే శివకుమార్ తన ఇంటికి సీఎం సిద్ధరామయ్యను బ్రేక్‌ఫాస్ట్‌కు ఆహ్వానించారు.


డీకే వర్గం వాదన ఇదే..

పైకి అంతా బాగుందని నవ్వులు చిందిస్తున్నా, డీకే వర్గం మాత్రం ఈ మూడు విషయాలపై గట్టిగా పట్టుబడుతోంది:

  • 2028లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలంటే డీకే శివకుమార్ సీఎం అయితేనే సాధ్యం.

  • కేవలం బ్రేక్‌ఫాస్ట్ మీటింగులతో సరిపెడితే కుదరదు, ఇచ్చిన మాట ప్రకారం అధికారం బదిలీ జరగాల్సిందే.

  • హైకమాండ్ ఇకనైనా ఈ పంచాయితీకి ఫుల్ స్టాప్ పెట్టి డీకేకు పట్టం కట్టాలి.

ఈ అల్పాహార విందులతో సమస్య సద్దుమొణుగుతుందా, లేక ఇది తుఫానుకు ముందు ప్రశాంతతా అన్నది వేచి చూడాలి.


Tags:

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!