మైక్రోసాఫ్ట్ బాస్ సత్య నాదెళ్ల భారత్పై కనకవర్షం కురిపించబోతున్నారు! ఏకంగా రూ. 1.45 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో మన దేశంలో ఏఐ విప్లవానికి తెరలేపనున్నారు. ఈ క్రమంలోనే ఆయన అదానీ గ్రూప్ బాస్ గౌతమ్ అదానీతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారత్లో భారీ విస్తరణకు సిద్ధమైంది. 'ఏఐ టూర్'లో భాగంగా ఇండియా వచ్చిన మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈఓ సత్య నాదెళ్ల (Satya Nadella) బుధవారం అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు టెక్నాలజీ భవిష్యత్తుపై, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సృష్టిస్తున్న అవకాశాలపై లోతుగా చర్చించారు.
అదానీతో 360 డిగ్రీల దోస్తీ!
సత్య నాదెళ్లతో భేటీ అనంతరం గౌతమ్ అదానీ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఆనందం వ్యక్తం చేశారు.
భాగస్వామ్యం: "భౌతిక, డిజిటల్ ప్రపంచాలు ఏకమవుతున్న ఈ ఏఐ యుగంలో.. మైక్రోసాఫ్ట్తో కలిసి పనిచేయడానికి (360-degree partnership) మేం ఉత్సాహంగా ఉన్నాం" అని అదానీ పేర్కొన్నారు.
ప్రశంస: సత్య నాదెళ్ల స్వయంగా రూపొందిస్తున్న ఏఐ యాప్స్ డెమోను చూడటం అద్భుతమని, అది ఆయన నాయకత్వ పటిమకు నిదర్శనమని కొనియాడారు.
నాలుగేళ్లలో రూ. 1.45 లక్షల కోట్లు!
మైక్రోసాఫ్ట్ ఆసియాలోనే అతిపెద్ద పెట్టుబడిని భారత్లో పెట్టబోతోంది. రాబోయే నాలుగేళ్లలో ఏఐ రంగం అభివృద్ధి కోసం ఏకంగా 17.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 1.45 లక్షల కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు సత్య నాదెళ్ల ప్రకటించారు.
Always a pleasure to meet @satyanadella and gain his valuable insights into the future of technology. We are excited to continue building a 360° partnership as the physical and digital worlds converge in the age of AI. Getting a demo from him of the AI apps he is personally… pic.twitter.com/T70YTbjTbT
— Gautam Adani (@gautam_adani) December 10, 2025
ప్రధాని మోదీతో భేటీ: అదానీతో సమావేశానికి ముందే, నాదెళ్ల ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, ఏఐ విషయంలో ప్రపంచం మొత్తం భారత్ వైపు ఆశగా చూస్తోందని అన్నారు. భారత యువత ఈ సాంకేతికతను అందిపుచ్చుకుని, వినూత్న ఆవిష్కరణలతో మెరుగైన ప్రపంచాన్ని నిర్మిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

