ప్రతి భారతీయ వంటగదిలో వెల్లుల్లి తప్పనిసరిగా ఉంటుంది. ఇది కేవలం వంటకాల రుచిని పెంచడానికే కాదు, అద్భుతమైన ఔషధ గనిగా కూడా పనిచేస్తుంది. ఇందులో విటమిన్ సి, బి6, మాంగనీస్, సెలీనియం, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.
అయితే, దీని పూర్తి ప్రయోజనాలు పొందాలంటే, ఉదయం ఖాళీ కడుపుతో తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల శరీరానికి రెట్టింపు ప్రయోజనాలు లభిస్తాయంటున్నారు.
రోగనిరోధక శక్తికి బూస్టర్
వెల్లుల్లిని "దివ్యౌషధం" అని పిలుస్తారు. రోజూ 2 నుండి 3 పచ్చి వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల మీ శరీరం రోగనిరోధక శక్తి అద్భుతంగా పెరుగుతుంది. వెల్లుల్లిలోని 'అల్లిసిన్' అనే సమ్మేళనం ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని అందిస్తుంది, అనారోగ్యానికి గురికాకుండా కాపాడుతుంది.
గుండెకు రక్ష.. కొలెస్ట్రాల్కు చెక్!
వెల్లుల్లిని క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గుతుంది. ఇది రక్తనాళాలను శుభ్రం చేసి, గుండె జబ్బులను నివారించడంలో సహాయపడుతుంది. రక్తపోటును అదుపులో ఉంచడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
బరువు తగ్గడానికి.. జీర్ణక్రియకు..
వెల్లుల్లిలో కొవ్వును కరిగించే సమ్మేళనాలు ఉన్నాయి. ఇది జీవక్రియను (Metabolism) వేగవంతం చేసి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే, మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు ఉన్నవారు రోజూ వెల్లుల్లి తినడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది.
ఎలా తినాలి?
పూర్తి ప్రయోజనాలు పొందాలంటే, ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో 2 నుండి 3 పచ్చి వెల్లుల్లి రెబ్బల తొక్క తీసి, బాగా నమిలి తినాలి. ఆ తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగడం మంచిది. కొలెస్ట్రాల్ను వేగంగా తగ్గించుకోవాలనుకునే వారు వెల్లుల్లిని తేనెలో ముంచి తినవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
కేవలం వంటలకే పరిమితం చేయకుండా, వెల్లుల్లిని మీ ఉదయపు దినచర్యలో భాగం చేసుకోవడం ద్వారా, అనేక అనారోగ్య సమస్యలకు మందులు లేకుండానే దూరంగా ఉండవచ్చు.

