తెలంగాణ సమ్మిట్‌కు మోదీ, రాహుల్: రేవంత్ భారీ స్కెచ్!

naveen
By -

ఒకే వేదికపై ప్రధాని మోదీ, రాహుల్ గాంధీనా? సీఎం రేవంత్ రెడ్డి వేసిన ఈ భారీ స్కెచ్ ఇప్పుడు దేశ రాజకీయాల్లోనే హాట్ టాపిక్‌గా మారింది!


Telangana Rising Global Summit guest list and preparations.


తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ (Telangana Rising Global Summit) కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. హైదరాబాద్‌లోని 'భారత్ ఫ్యూచర్ సిటీ' వేదికగా డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగనున్న ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరిని స్వయంగా కలిసి ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు.


ఆ లిస్ట్ చూస్తే మైండ్ బ్లాక్!

కేవలం రాజకీయ నాయకులే కాదు, ఈ సమ్మిట్‌కు హాజరయ్యే వారి జాబితా చాలా పెద్దది. ప్రపంచం చూపు తెలంగాణ వైపు తిప్పుకునేలా ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఆహ్వానితుల జాబితాలో వీరు ఉన్నారు:

  • కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు.

  • దేశ విదేశాలకు చెందిన బడా పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు.

  • సినీ, క్రీడా, మీడియా ప్రముఖులు మరియు దౌత్యవేత్తలు.

ఇప్పటికే 4,500 మందికి పైగా ఆహ్వానాలు పంపగా, సుమారు 1,000 మంది తమ రాకను ఖరారు చేశారని స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్ తెలిపారు.


విజన్ 2047.. CURE మరియు PURE!

ఈ వేదికపైనే ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించనున్నారు. రాష్ట్రాన్ని మూడు భాగాలుగా విభజించి అభివృద్ధి చేయాలన్నది సర్కార్ లక్ష్యం. హైదరాబాద్‌ను కాలుష్య రహితంగా మార్చేందుకు 'కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ' (CURE), ఔటర్ రింగ్ రోడ్డు ఆవల 'పెరి అర్బన్ రీజియన్ ఎకనామిక్' (PURE) జోన్‌లను అభివృద్ధి చేయనున్నారు. మూసీ సుందరీకరణ, మెట్రో విస్తరణ, బుల్లెట్ రైలు వంటి మెగా ప్రాజెక్టులు ఈ విజన్‌లో భాగం కానున్నాయి.


Tags:

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!